Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దర్శకుడిగా మారిన ఆర్ట్ డైరెక్టక్ అశోక్... ‘మౌనమే ఇష్టం’ కాన్సెప్టు ఇదే!
సాయి కార్తీక్, పార్వతి అరుణ్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'మౌనమే ఇష్టం'. ఆర్ట్ డైరెక్టర్ దాదాపు 150కిపైగా సినిమాలకు పని చేసి 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న అశోక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 15న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లో అశోక్ మాట్లాడుతూ... మంచి స్టోరీ దొరికితే దర్శకత్వం చేయాలని 15 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. ఇదొక పోయెటిక్ లవ్ స్టోరీ. ఎలా ప్రపోజ్ చేయాలనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. మార్చ్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని తెలిపారు.
హీరో సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఒదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఎంటో అనేది ఈ సినిమా చూపిస్తున్నామని తెలిపారు.
కథా రచయిత సురేష్ మాట్లాడుతూ.. ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ప్రపోజ్ చేసుకుంటే వారు విడిపోవాల్సిన సందర్భం ఏర్పడితే వారి పరిస్థితి ఏంటి అనే అద్భుతమైన కథాంశం సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందన్నారు.
ఈచిత్రానికి కథ: సురేష్ గడిపర్తి, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, కెమెరా: జె.డి.రామ్ తులసి, సంగీతం: వివేక్ మహాదేవా, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, నిర్మాత: ఆశ అశోక్, స్కీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ కోరాలత్.