Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడిగా మారిన స్టార్ ప్రొడ్యూసర్.. వైరలవుతోన్న ‘డర్టీ హరి’ ఫస్ట్ లుక్
శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు, టెక్నీషియన్లు ఆయన చిత్రాలతో స్టార్స్గా ఎదిగారు. ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ తీస్తున్న చిత్రం డర్టీ హరి. ఎస్. పి. జి. క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో, గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న చిత్రంఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .
ఈ చిత్రం ద్వారా శ్రవణ్ రెడ్డి అనే ఒక హైదరాబాద్ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తుండగా , రుహాని శర్మ , సిమ్రత్ కౌర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా డర్టీ హరి గురించి దర్శకుడు ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ.. 'బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో చాలా బోల్డ్ గా ఉన్నా బ్యూటిఫుల్గా, క్లాసికల్గా ఉండేవి. అలాంటి వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నేను కూడా చాలా బోల్డ్ గానూ, పొయెటిక్గానూ మలిచాను. ఇది ఆడియన్స్కి నచ్చుతుందని నమ్ముతున్నా'ని అన్నారు.
చిత్ర సమర్పకులు గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికి కథాంశం గోప్యంగా ఉంచుతున్నాం. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామ'ని తెలిపారు . చిత్రనిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ.. 'డర్టీ హరి కొంత బోల్డ్ ప్రయత్నం అయినా, ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఏ మాత్రం మిస్ చేయలేదు. శ్రవణ్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తున్నాం. రిలీజ్ డేట్ని త్వరలో ప్రకటిస్తామ'ని తెలిపారు. రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ . ఇతర పాత్రలను పోషించారు.