Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కల్యాణ్ అభిమానుల మృతి.. మైత్రీ మూవీస్ 2 లక్షల ఆర్థిక సహాయం
పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో జరిగిన అపశృతిపై టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పవన్ కల్యాణ్ జన్మదినం రోజును పురస్కరించుకొని బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతున్న యువకుల్లో ముగ్గురు మరణించడం, నలుగురు గాయపడటం తీవ్ర విషాదంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
మరణించిన పవన్ అభిమానుల కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ ముందుకొచ్చారు. మరణించిన యువకుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అదించనున్నట్టు మైత్రీ మూవీస్ ప్రకటించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన యువకులు మరణించడంపై మైత్రీ మూవీస్ నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తమ ప్రకటనలో ఆకాంక్షించారు.
ఇప్పటికే వకీల్ సాబ్ యూనిట్ కూడా మృతులకు ఆర్థిక పరిహారం చెల్లించారు. వకీల్ సాబ్ యూనిట్ తరుఫున శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ అభిమానులు మృతిపై మెగా హీరోలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, బన్నీ తదితరులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.