Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
ఒకేసారి 10 సినిమాలను లైన్ లో పెట్టిన తెలుగు ప్రొడక్షన్ హౌజ్
మైత్రి మూవీ మేకర్స్ అంటే ఇప్పుడు తెలుగులో అందరికంటే ఎక్కువ సినిమాలను నిర్మిస్తోంది. మొదట యూఎస్ లో తెలుగు సినిమాలను రిలీజ్ చేసి ఎన్నో ప్రాఫిట్స్ అందుకున్న ఈ ప్రొడక్షన్ నిర్మాతలు మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అక్కడి నుంచి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా మంచి సినిమాలను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లో 10 సినిమాలు రూపొందుతున్నాయి. అందులో కోన్ని విడుదలకు కూడా సిద్ధమయ్యాయి. మెయిన్ గా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పాన్ ఇండియా అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ తో మరోసారి సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. నాని అంటే సుందరిని కూడా రెడీ అవుతోంది. ఇక ఉప్పెన సినిమాను సుకుమార్ ప్రొడక్షన్ లో నిర్మించగా ఆ సినిమా వచ్చే నెలలో రానుంది.
ఇక పవన్ కళ్యాణ్, హరీష్ కంకర్ కాంబోతో పాటు బాలకృష్ణ - గోపిచంద్ మలినేని, కొరటాల శివ - రామ్ చరణ్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, చిరంజీవి - బాబీ, విజయ్ దేవరకొండ - శివ నిర్వణ వంటి కాంబినేషన్స్ లలో సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అంటే వీరి పెట్టుబడులు కూడా ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌజ్ లలో మైత్రి మూవీ మేకర్స్ కూడా కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.