Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా, నందమూరి అభిమానులకు కన్నుల పండగ: స్పెషల్ కిక్కిచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్
Recommended Video
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత జక్కన్న చేస్తున్న మరో భారీ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా అడుగుపెట్టారు. అయితే తాజాగా ఆయనతో ఓ ఫోటో దిగిన మెగా, నందమూరివారసులు వారి వారి అభిమానులను కనువిందు చేశారు. వివరాల్లోకి పోతే..
భారీ తారాగణం.. జక్కన్న ప్లాన్
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
తీసుకొని
RRR
సినిమా
తెరకెక్కిస్తున్నారు
జక్కన్న.
ఈ
సినిమా
కోసం
టాలీవుడ్
నుంచి
ఎన్టీఆర్,
రామ్
చరణ్
భారీ
లాంటి
భారీ
తారాగణానికి
తోడు
బాలీవుడ్
నుంచి
అజయ్
దేవగణ్,
అలియా
భట్
లాంటి
స్టార్
నటీనటులను
తీసుకున్నారు.
వారి
కోసం
ప్రత్యేకంగా
పాత్రలు
రూపొందించారు.
ఎప్పుడో చెప్పిన రాజమౌళి.. ఇప్పటిదాకా
చాలా రోజుల క్రితమే RRR ప్రాజెక్టు ప్రకటించిన రాజమౌళి గత కొంతకాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకున్నట్లు టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ లకు సంబంధించిన షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇక ఇప్పుడు RRR సెట్స్ పైకి అజయ్ దేవగణ్ కూడా వచ్చేశారు.
|
అభిమానులకు ఎన్టీఆర్ కిక్
ఈ మేరకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్కి సంబంధించిన షెడ్యూల్ జనవరి 21 నుంచే ప్రారంభమయింది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆయనతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ అభిమానులకు కిక్కిచ్చారు ఎన్టీఆర్.
|
ఒకే ఫ్రేమ్లో దిగ్గజాలు.. అభిమానులకు కన్నుల పండగ
రామ్ చరణ్, రాజమౌళి, అజయ్ దేవగణ్ లతో దిగిన పిక్ షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. "మా RRR లోకంలోకి వచ్చేసిన అజయ్ దేవగణ్ సార్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగా, నందమూరి అభిమానులకు ఈ పిక్ కన్నుల పండగగా మారింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ జోడీ.. ఇద్దరు హీరోయిన్లు
ఇక చిత్రంలో రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. చారిత్రాక నేపధ్యమున్న ఈ చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్ పరిశీలనలో పెట్టింది చిత్రయూనిట్. జులై 30 అనుకున్నా చిత్ర విడుదల తేదీపై సందేహాలు కొనసాగుతున్నాయి.