జనతా కర్ఫ్యూ : దాని వెనకున్న రహస్యం అదే.. అసలు విషయం బయపెట్టిన నాగబాబు
మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రధాని కోరాడు. విశృంఖలంగా విజృంభిస్తోన్న కరోనా కట్డడికి ప్రజలంతా స్వచ్చందగా కర్ఫ్యూ విధించుకోవాలని కోరాడు. కోరుతున్నా. మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ఇంటి పట్టునే ఉండాలని కోరాడు.
విస్తరిస్తున్న కరోనా..
దేశంలో రోజు రోజుకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే మరణాల రేటు మాత్రం తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే విషయమే. కరోనాను అడ్డుకునేందుకు ప్రధాని పిలుపు ఇవ్వగా.. విపరీతమైన స్పందన వస్తోంది. సెలెబ్రిటీలు మోదీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.
గొప్ప నిర్ణయం..
‘భారత ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూను విధించింది. ఒక వేళ మనం దీన్ని విస్మరిస్తూ.. కఠిన చర్యలతో కర్ఫ్యూను విధించే అవకాశం ఉంది. చైనా దేశంలో తీసుకున్నట్లుగా కఠిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి.

జనతా కర్ఫ్యూ వల్ల లాభమేంటి..?
జనతా కర్ఫ్యూ వల్ల ఒనగూర లాభమేంటి?.. అంటే ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలు.. అయితే మన కర్ఫ్యూ మాత్రం 14గంటలు.. ఒకవేళ అందరూ పాటిస్తే.. కరోనా ఉన్న చోటు ఆ 14గంటలు ఎవరూ చేరలేదు. దీంతో ఆ గొలుసును మనం ఆపే అవకాశం ఉంది.
Recommended Video

ఆపై సురక్షిత దేశం..
ఆ పద్నాలుగు గంటల తరువాత దేశం సురక్షితంగా తయారవుతుంది. ఇదే జనతా కర్ఫ్యూ వెనుకున్న సీక్రెట్. మన భవిష్యత్ కోసం మరో సారి అవరసమైతే.. దీన్ని విధించవచ్చు. జనతా కర్ఫ్యూకు నా మద్దతు.. మార్చి 22, 2020'అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











