Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎట్టకేలకు అక్కినేని వారసుడిని కన్ఫర్మ్ చేసిన పరశురామ్.. అఫీషియల్ అనౌన్స్మెంట్
'గీత గోవిందం' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పరశురామ్.. తన తర్వాతి సినిమాను కన్ఫర్మ్ చేశాడు. ఎప్పటినుంచో ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తాడా? అనే కుతూహలానికి తెరదించుతూ నాగచైతన్యతో సినిమా ఓకే చేశాడు.
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో రాబోతున్న 20వ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు #NC20 ప్రాజెక్టును అధికారికంగా ఖాయం చేశారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ లోగోతో విడుదలైన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్లో నాగచైతన్య- పరశురామ్ సహా 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట- గోపిచంద్ ఆచంట కనిపిస్తున్నారు.
జోష్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన ఈ అక్కినేని వారసుడు ఇప్పటికే 18 సినిమాలు పూర్తిచేశాడు. తన 18 వ సినిమా 'వెంకీమామ'ను మామ వెంకటేష్ తో కలిసి చేశాడు. డిసెంబర్ 13న ఆ సినిమా విడుదలైంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే వర్కింగ్ టైటిల్ తో తన 19వ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారి తెలంగాణ రూరల్ యాస మాట్లాడే కుర్రాడిగా చైతు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న తన 20వ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చేస్తాడు నాగచైతన్య.