Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎట్టకేలకు అక్కినేని వారసుడిని కన్ఫర్మ్ చేసిన పరశురామ్.. అఫీషియల్ అనౌన్స్మెంట్
'గీత గోవిందం' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ పరశురామ్.. తన తర్వాతి సినిమాను కన్ఫర్మ్ చేశాడు. ఎప్పటినుంచో ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తాడా? అనే కుతూహలానికి తెరదించుతూ నాగచైతన్యతో సినిమా ఓకే చేశాడు.
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో రాబోతున్న 20వ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు #NC20 ప్రాజెక్టును అధికారికంగా ఖాయం చేశారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ లోగోతో విడుదలైన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్లో నాగచైతన్య- పరశురామ్ సహా 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట- గోపిచంద్ ఆచంట కనిపిస్తున్నారు.
జోష్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన ఈ అక్కినేని వారసుడు ఇప్పటికే 18 సినిమాలు పూర్తిచేశాడు. తన 18 వ సినిమా 'వెంకీమామ'ను మామ వెంకటేష్ తో కలిసి చేశాడు. డిసెంబర్ 13న ఆ సినిమా విడుదలైంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే వర్కింగ్ టైటిల్ తో తన 19వ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారి తెలంగాణ రూరల్ యాస మాట్లాడే కుర్రాడిగా చైతు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న తన 20వ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చేస్తాడు నాగచైతన్య.