Don't Miss!
- News బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. నాగ్, మంచు లక్ష్మీ ట్వీట్స్ వైరల్
ప్రపంచం ఇప్పుడు మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్తో భారత దేశం అతలాకుతలం అవుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది కంటే ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారేలా కనిపిస్తోందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య దినం గురించి అందరూ ట్వీట్లు పెడుతున్నారు.
అయితే ఈ క్రమంలో నేటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా అందరికీ ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరికీ ఓ సందేశాన్ని ఇచ్చాడు. నేడు ప్రపంచ ఆరోగ్య దినం.. ఇలాంటి కోవిడ్ పరిస్థితిలో మీరు, మీ ప్రియమైన వారు సురక్షంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి అని నాగ్ చెప్పుకొచ్చాడు.
మరో వైపు మంచు లక్ష్మీ ట్వీట్ వేస్తూ.. ప్రతీ ఒక్కరికీ క్వాలిటీతో కూడిన వైద్య సేవలు అందాలి.. వారికి అవసరం ఉన్నప్పుడు వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి.. ఇలాంటి వాటిపై అందరికీ అవగాహన కలిగించేందుకుప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి అంటూ వరల్డ్ హెల్త్ డే గురించి చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ మొన్న హోలీ నాడు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.రకుల్ ప్రీత్, తన కూతురు విద్యలతో కలిసి మంచు లక్ష్మీ తెగ సందడి చేసింది.