Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. నాగ్, మంచు లక్ష్మీ ట్వీట్స్ వైరల్
ప్రపంచం ఇప్పుడు మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్తో భారత దేశం అతలాకుతలం అవుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది కంటే ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారేలా కనిపిస్తోందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య దినం గురించి అందరూ ట్వీట్లు పెడుతున్నారు.
అయితే ఈ క్రమంలో నేటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా అందరికీ ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరికీ ఓ సందేశాన్ని ఇచ్చాడు. నేడు ప్రపంచ ఆరోగ్య దినం.. ఇలాంటి కోవిడ్ పరిస్థితిలో మీరు, మీ ప్రియమైన వారు సురక్షంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి అని నాగ్ చెప్పుకొచ్చాడు.
మరో వైపు మంచు లక్ష్మీ ట్వీట్ వేస్తూ.. ప్రతీ ఒక్కరికీ క్వాలిటీతో కూడిన వైద్య సేవలు అందాలి.. వారికి అవసరం ఉన్నప్పుడు వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి.. ఇలాంటి వాటిపై అందరికీ అవగాహన కలిగించేందుకుప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి అంటూ వరల్డ్ హెల్త్ డే గురించి చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ మొన్న హోలీ నాడు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.రకుల్ ప్రీత్, తన కూతురు విద్యలతో కలిసి మంచు లక్ష్మీ తెగ సందడి చేసింది.