Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
చైతూ, సామ్ బ్లాక్ బస్టర్ కపుల్.. నాగ్కు మజిలీ జోష్
నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా నటించిన మజిలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రంపై తొలుత డివైడ్ టాక్ వచ్చినా.. చివరకు ఫీల్గుడ్ టాక్ను సొంతం చేసుకొన్నది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 17.5 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దాంతో అక్కినేని ఫ్యామిలీలో సంతోషం నెలకొన్నది. తన కుమారుడు, కోడలు నటించిన చిత్రం సూపర్ హిట్ కావడంతో నాగార్జున ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మజిలీ విజయం నేపథ్యంలో నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మై బ్లాక్ బస్టర్ కపుల్ అంటూ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. నాగార్జున ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని అభిమానులు లైకుల మీద లైకులు కొట్టడం గమనార్హం.
మజిలీ తర్వాత చైతూ వెంకీ మామ చిత్రంలో, సామ్ ఓ బేబీ, 96 చిత్రాల రీమేక్లో నటించనున్నారు. నాగార్జున బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు.