Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను.. నా మన్మథుడి ఫ్యామిలీ.. నాగార్జున ట్వీట్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. చాలా ఏళ్ల తర్వాత మన్మథుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న మన్మథుడు2 చిత్రానికి ఇటీవల పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులతో కలిసిన ఫోటోను సోమవారం నాగార్జున ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది.
నేను నా మన్మథుడు2 ఫ్యామిలి ఇది. ఈ టీమ్తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో షూట్కు రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
మన్మథుడు చిత్రం షూటింగ్ మొత్తం యూరప్లో జరుగనున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరప్ బయలుదేరి వెళ్తున్నది. గతంలో మన్మథుడు సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకోవడం జరిగింది.