Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నేను.. నా మన్మథుడి ఫ్యామిలీ.. నాగార్జున ట్వీట్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. చాలా ఏళ్ల తర్వాత మన్మథుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న మన్మథుడు2 చిత్రానికి ఇటీవల పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులతో కలిసిన ఫోటోను సోమవారం నాగార్జున ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది.
నేను నా మన్మథుడు2 ఫ్యామిలి ఇది. ఈ టీమ్తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో షూట్కు రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
మన్మథుడు చిత్రం షూటింగ్ మొత్తం యూరప్లో జరుగనున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరప్ బయలుదేరి వెళ్తున్నది. గతంలో మన్మథుడు సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకోవడం జరిగింది.