Mahesh Babu షూటింగుతో బిజీగా సూపర్స్టార్.. ఫోటోను లీక్ చేసిందెవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారీ పాట సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల పలు దేశాల్లో విహారయాత్రలతో దుమ్మురేపాడు. భార్య నమత్రా శిరోద్కర్, కూతురు సితార, కుమారుడు గౌతమ్తో విహారయాత్రలు ముగించేశాడు. ఇక కుమారుడు గౌతమ్ను లండన్ కాలేజీలో చేర్పించడమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం సిద్దమవుతున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది మహేష్ బాబు భారీగా తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఆగస్టు 9వ తేదీన బర్త్ డేను పురస్కరించుకొన్ని ప్రపంచవ్యాప్తంగా మహేష్ నటించిన చిత్రాలను ప్రత్యేక ప్రదర్శనలు వేసి సంచలనం రేపారు. ఒక రోజు ప్రదర్శించిన పోకిరి, ఒక్కడు సినిమా ప్రీమియర్లతో వచ్చిన కలెక్షన్లను మహేష్ బాబు ఫౌండేషన్కు అందించారు.

ఇక ఇదిలా ఉండగా, మహేష్ బాబు యాడ్ షూటింగ్తో బిజీగా మారారు. హైదరాబాద్లో జరిపిన టీవీసీ కంపెనీ యాడ్ షూటింగులో మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షూటింగ్ లోకేషన్లో తీసిన మహేష్ బాబు ఫోటోను నమ్రతా శిరోద్కర్ డీపీగా పెట్టుకోవడం వైరల్ అయింది. ఆ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మహేష్ యాడ్ షూటింగ్ విషయం బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా, త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్లోకి యూనిట్ వెళ్లడానికి సిద్దం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











