Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
భారీ ధరకు ‘ఆఖండ’ శాటిలైట్, డిజిటల్ రైట్స్: ఏ సంస్థ దక్కించుకుందో తెలుసా?
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'అఖండ'. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇటీవల విడుదలై టైటిల్ రోర్ వీడియోకు రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. దీంతో బాలయ్య పేరిట సరికొత్త చరిత్ర నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
'అఖండ' మూవీపై బయట నెలకొన్న అంచనాల దృష్ట్యా థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్లు ఇప్పటికే తెలిసింది. ఫేమస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కుల డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'అఖండ' మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ, శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ తీసుకుందట. ఇందుకు గానూ భారీ ధరను చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 'అఖండ' చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.