Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శబ్దం, శాసనం అంటూ బోయపాటి స్టైల్ డైలాగ్లు.. మళ్లీ బాలయ్య రచ్చ రచ్చే
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాలయ్య అభిమానులకు ఇక పండగే. అయితే వీరి కాంబినేషన్ను సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేస్తాడు. బోయపాటి యాక్షన్, బాలయ్య మ్యానరిజం డైలాగ్లతో థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్లో సింహా, లెజెండ్ లాంటి సినిమాలు రాగా.. అవి ఎంతటి సెన్సేషన్ను సృష్టించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు.
మొదలైన చిత్రం..
హ్యాట్రిక్ కొట్టేందుకు బాలయ్య-బోయపాటి జోడీ మరోసారి కలిసింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా నేడు ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు బి గోపాల్, అంబికా కృష్ణ వంటి వారు హాజరయ్యారు.
క్లాప్ కొట్టిన దర్శకుడు..
నేడు అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ముహూర్తపు షాట్కు బి.గోపాల్ క్లాప్ కొట్టగా, అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం వీరంతా మాట్లాడుతూ చిత్ర విశేషాలను తెలిపారు. అటుపై బాలయ్య మైకు అందుకుని తన స్టైల్లో రెచ్చిపోయాడు.
డైలాగ్లు ఫేమస్..
బాలయ్య-బోయపాటి సినిమాలంటే డైలాగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహా, లెజెండ్ లాంటి సినిమాల్లోని డైలాగ్లు ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉన్నాయి. అలాంటిది రాబోయే ఈ కొత్త చిత్రంలోనూ తూటాల్లాంటి మాటలున్నట్లు తెలుస్తోంది. శాంపిల్గా ఓ డైలాగ్ చెప్పి అందరిలోనూ ఎనర్జీ నింపేశాడు బాలయ్య.
Recommended Video
శబ్దం.. శాసనం..
బోయపాటి డైలాగ్లు రాస్తే అవి బాలయ్యే చెప్పాలనేంత ఘాటుగా, పవర్ ఫుల్గా ఉంటాయి. నేటి ప్రారంభోత్సవ వేడుకలో బాలయ్య చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం వైలర్గా మారింది. ‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం' అనే పవర్ఫుల్ డైలాగ్ను ముహూర్తం షాట్ లోనే బాలయ్య చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. సినిమాకు ఇంకా హీరోయిన్ను ఫిక్స్ చేయలేదు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.