Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
వేట మొదలెట్టబోతున్న బాలకృష్ణ: ముహూర్తం ఫిక్స్ చేసిన యంగ్ డైరెక్టర్
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ, అవేమీ ఈ సీనియర్ హీరోకు సక్సెస్ను అందించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో బాలయ్య.. బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు.
Bheemla Nayak First Glimpse: చరిత్ర సృష్టించిన పవన్.. ప్రభాస్ కంటే రెండితలు.. చిరు రికార్డు బద్దలు
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీని తర్వాత నటసింహా.. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. వాస్తవానికి దీన్ని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా 'అఖండ' షూట్ ఆలస్యం కావడంతో.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే నందమూరి బాలకృష్ణకు కథ చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 నుంచి పట్టాలెక్కించబోతున్నారట. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ఏర్పాట్లను కూడా చేస్తోందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందుకోసం ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ఓ సెట్ను కూడా నిర్మించాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ 107వ సినిమాగా రాబోతున్న దీన్ని ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్తో ప్రారంభించబోతున్నట్లు కూడా ఓ వార్త తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే యాక్షన్ పార్ట్కు సంబంధించిన ఎపిసోడ్స్ను ఫైట్ మాస్టర్లతో కలిసి డిజైన్ చేయించేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్ఫుల్గా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.
నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని ఆలోచించా: రోజా షాకింగ్ కామెంట్స్
ఈ సినిమా కోసం నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రెడీ చేశాడీ యంగ్ డైరెక్టర్. పల్నాడు నేపథ్యంతో సాగే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుందట. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నాడని ఈ మధ్యనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రను చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.