Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దు: బాలయ్య
'మనకు 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుడిని ఎన్నుకునే అవకాశం వస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన హక్కు. మన చేతిలో ఆయుధం' అన్నారు సినీ నటుడు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన గురువారం ఓటు వేశారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగ పరుచుకోవాలి, ఎవరూ అలసత్వం చేయకుండా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని బాలయ్య సూచించారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్... పోలింగ్ తేదీని సెలవు దినంగా భావించి ఇంట్లో కూర్చోకుండా వచ్చి ఓటు వేయాలని కోరారు బాలయ్య.
ఏ ప్రభుత్వం వస్తే మీ అవసరాలు తీరుతాయో, అభివృద్ధి జరుగుతుందో, మీకు మంచి సంక్షేమ పథకాలు అమలు అవుతాయో, మీ భవిష్యత్ బావుంటుందని భావిస్తారో వారికి ఓటు వేయండి అని ఈ సందర్భంగా బాలకృష్ణ స్పష్టం చేశారు.
గత ఐదేళ్లుగా నేను హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచే ఓటు వేయడం... సొంత ఊర్లో ఓటు వేస్తున్నంత ఆనందంగా ఉందని బాలయ్య తెలిపారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధరదేవి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.