Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి మానవత్వం ప్రదర్శించిన బాలకృష్ణ.. హిందూపురం ప్రజల కోసం..
టాలీవుడ్ బాక్సాఫీస్ బొనాంజా, నట సింహం, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి మానవత్వాన్ని ప్రదర్శించారు. తనను ఎన్నుకొన్న ప్రజల ఆరోగ్యం గురించి భారీగా విరాళం ప్రకటించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలువాలని బాలయ్య భావించారు.
హిందూపురం పరిధిలోని కరోనా పేషెంట్లకు రూ.55 లక్షల విలువైన పీపీఈ కిట్స్,మాస్కులు, మెడిసిన్స్, ఇతర పరికరాలను ప్రభుత్వ హాస్పిటల్కు అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇలాంటి పరికరాలు, కిట్స్ అందించడం వల్ల కరోనా పేషెంట్లకు సేవ చేసే వైద్యులకు రక్షణ కవచంలా ఉపయోగపడుతాయి. ఆగస్టు 29, 30వ తేదీన తన నియోజకవర్గంలో పర్యటించి ఈ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు.
గతంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో బసవతారకం ట్రస్ట్ తరఫున 25 లక్షల విలువైన 2 వెంటిలేటర్లు, 100 పీపీఈ యూనిట్లు, మాస్కులు అందించారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళం కూడా అందించారు.
అలాగే సినీ కార్మికులను ఆదుకొనేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కోసం 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన హిందూపూరం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొన్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.