‘Balakrishna నందమూరి బాలకృష్ణ మానసిక రోగి.. ఆమె వల్లే ఆయనకు అలాంటి పిచ్చి’
నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరిలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ బెయిల్పై ఉండి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని పురందేశ్వరి సుప్రీం కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖను తప్పుబడుతూ ధ్వజమెత్తారు. పురందేశ్వరి మేక వన్నె పులి అంటూ వ్యాఖ్యలుు చేశారు. ఇక బాలకృష్ణపై నిప్పులు చెరుగుతూ పోసాని చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ పబ్లిక్గా, లక్షలాది మంది టెలివిజన్ చూస్తుండగా.. ఆడవారు కనిపిస్తే.. ముద్దన్నా పెట్టాలి. దానికి కడుపున్నా చేయాలి అంటూ మాట్లాడాడు. ఆ మాటలు వింటే ఆయన ఎంత సంస్కార వంతుడో తెలియాలి. అలాంటి బాలకృష్ణ అంటే పురందేశ్వరికి ఎంత ప్రేమంటే? ఏం మాట్లాడినా భలే కొటేషన్ వేశావు అంటూ ప్రోత్సాహిస్తుంటుంది అని పోసాని అన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇద్దరిని బాలకృష్ణ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. దాంతో వారు చావుబతుకుల్లో హాస్పిటల్లో ఉంటే.. అతడిని జైలులో పెట్టకుండా పురందేశ్వరి డ్రామా ఆడారు. బాలయ్యను జైల్లో పెట్టకుండా అడ్డుకొని.. మా తమ్ముడికి మెంటల్. అతడు మానసిక రోగి. పిల్లల మనస్తత్వం అంటూ ప్రముఖ డాక్టర్లు చేత సర్టిఫికెట్ ఇచ్చి అతడిని కాపాడింది అని పోసాని ఎద్దేవా చేశారు.

పురందేశ్వరి చేసిన ప్రయత్నాల వల్ల బాలకృష్ణ ఒక్క గంట కూడా జైలుకు వెళ్లలేదు. మంచి ఫైవ్ స్టార్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆయన మానసిక రోగి. అతడికి పిచ్చెక్కింది అంటూ మందులు వాడమంటే.. విస్కీ, బ్రాందీలు తాగి ఎంజాయ్ చేశారు. హాస్పిటల్లో చికెన్, అవకాయ పచ్చడి, పప్పుతో ఆనందంగా గడిపాడు అని పోసాని ఆరోపించారు.

సినీ ప్రముఖులపై కాల్పులు జరిపిన నందమూరి బాలకృష్ణకు 16 ఏళ్ల తర్వాత కూడా పిచ్చి తగ్గలేదా? పురందేశ్వరి కారణంగానే ఆయనకు పిచ్చి పట్టింది. కాల్పుల ఘటన తర్వాత బాలయ్యను చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి. కానీ చట్టానికి వ్యతిరేకంగా పురందేశ్వరి వ్యవహరించి బెయిల్ ఇప్పించింది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం విడ్డూరం అని పోసాని ఘాటుగా స్పందించారు.

పురందేశ్వరి, బాలకృష్ణపై తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసలు గుప్పించారు. జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరు కొంటున్నాను. కేసీఆర్ లాంటి అపరమేధావి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి సీఎం పదవికి అర్హుడు అంటూ పోసాని కృష్ణ మురళీ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











