Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో ఫొటో వచ్చేసింది.. స్టైలిష్ లుక్లో బాలకృష్ణ.. బయటికొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్
'జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ఇటీవల థాయ్లాండ్లో ప్రారంభమైంది. భారీ షెడ్యూల్లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్లో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. సోమవారం బాలయ్య లుక్కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పిక్ బయటకు వచ్చింది. ఈ ఫొటో లీక్ అయింది కాదు.. నందమూరి బాలకృష్ణే స్వయంగా విడుదల చేశారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఈ పిక్ను షేర్ చేసిన బాలయ్య.. 'కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా 105వ సినిమాలోని లుక్ ఇది' అని పేర్కొన్నాడు. ఇందులో బాలయ్య స్లిమ్గా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య చేసే పాత్రల్లో ఒకటి కొరియన్ సిటిజన్కు సంబంధించినది అని ఓ వార్త బయటకు వచ్చింది. అందుకే సినిమాను విదేశాల్లో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా టైటిల్ విషయంలోనూ పలు పేర్లు తెరపైకి వచ్చాయి. దీనికి 'రూలర్' టైటిల్ పెడుతున్నారని మొదట ప్రచారం జరిగినప్పటికీ, ఈ మధ్య మరో పేరు బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమాకు 'క్రాంతి' అనే టైటిల్ పెట్టబోతునట్లు తెలుస్తోంది. దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట నిర్మాత కల్యాణ్.