Don't Miss!
- News సీఎం హోదాలో కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి ఇప్పుడు ఎలా గెలుస్తారో చూస్తాం, సీఎం చాలెంజ్ !
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
‘అఖండ’ విషయంలో బాలయ్య పునరాలోచన: నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడా?
సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. కెరీర్ ఆరంభం నుంచే ఇదే ఫార్మాలాను ఫాలో అవుతున్నాడాయన. అందుకే వేగంగా చిత్రాలను చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న నటసింహా.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని ఎప్పుడో ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఇంకా పూర్తి చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రీకరణ విషయంలో బాలయ్య డేర్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్
కరోనా ప్రభావం రోజు రోజుకూ పెరిగిపోతోండడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న సినిమాల షూటింగ్లు ఒక్కక్కటిగా ఆగిపోయాయి. ఒకరిద్దరు హీరోలు మినహా మిగిలిన వాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో బాలయ్య 'అఖండ' షూటింగ్ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఈ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మే 13 నుంచి ఈ సినిమా షూటింగ్ను పున: ప్రారంభించబోతున్నారని అన్నారు. అంతేకాదు, ఈ షెడ్యూల్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ - నందమూరి బాలకృష్ణ మధ్య జరిగే లవ్ సీన్స్ తీయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఇక, తాజా సమాచారం ప్రకారం.. 'అఖండ' షూటింగ్ విషయంలో బాలయ్య పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర తరం అవుతోన్న నేపథ్యంలో చిత్రీకరణను కొద్ది రోజులు వాయిదా వేస్తేనే మంచిదని ఆయన భావిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇదే జరిగితే 'అఖండ' షూటింగ్ ఆలస్యం అవడంతో పాటు విడుదలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాతో పాటు పూర్ణ హీరోయిన్గా చేస్తోంది. శ్రీకాంత్ విలన్గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.