Don't Miss!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Ruler ప్రెస్ మీట్: బాలకృష్ణ ఎలాంటివాడో చెప్పేసిన హీరోయిన్
నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం రూలర్. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రయూనిట్ ఆదివారం (డిసెంబర్ 22) రోజు జరిగిన పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''రూలర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఓ మంచి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. కల్యాణ్గారు ఖర్చుకు ఎక్కడా కాంప్రైజ్ కాలేదు. కళ్యాణ్ గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న సినిమా చేయాలని భావించే నిర్మాత ఆయన. ఆయనకు నా తరపున, అభిమానుల తరపున కృతజ్ఞతలు. వి.ఎస్.ఆర్.స్వామిగారి వద్ద శిష్యరికం చేసిన రాంప్రసాద్గారు ఈ సినిమాకు మంచి విజువల్స్ను అందించారు. ఆయనకు కృతజ్ఞతలు. హీరోయిన్స్ సోనాల్, వేదిక చక్కగా నటించారు.
జయసుధ గారు, ప్రకాష్రాజు, సప్తగిరి, ధన్ రాజ్, రఘు గారు అందరూ చక్కగా నటించారు. పరుచూరి మురళిగారు మంచి కథను, డైలాగ్స్ను కూడా అందించారు. డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్గారు ఆర్టిస్టుల దగ్గర నుండి ఏం కావాలో ఆ నటనను రాబట్టుకోవడంలో దిట్ట. అలాగే నిర్మాతల దర్శకుడు కూడా ఆయన. చిరంతన్ భట్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అన్నారు.
హీరోయిన్ వేదిక మాట్లాడుతూ.. ''సినిమాను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. బాలకృష్ణ లాంటి హీరోతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. హీరోగానే కాదు, వ్యక్తిగా కూడా ఆయనెంతో మంచివారు. కల్యాణ్గారు అందరినీ ఎంతో కేర్గా చూసుకున్నారు. ఈ సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చిందుకు దర్శక నిర్మాతలకు, బాలకృష్ణగారికి థ్యాంక్స్'' అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ''జైసింహా తర్వాత మరోసారి మా కాంబినేషన్లో వచ్చిన రూలర్ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. రాంప్రసాద్ గారు సినిమాను అద్భుతంగా విజువలైజ్ చేసి చూపించారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. ఐదు నెలలు పాటు టీం అందరం ఎంతగానో హార్డ్ వర్క్ చేశాం. మళ్లీ నెక్ట్స్ సినిమాను కూడా దీని కంటే మంచి సినమా ఇస్తానని తెలియజేస్తున్నాను'' అన్నారు.