Don't Miss!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
‘వి’చిత్రమైన టైటిల్తో నాని 25వ చిత్రం ప్రారంభం, ప్రత్యేకతలు ఇవే..
'జెర్సీ'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నేచురల్ స్టార్ నాని తన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీకి సిద్ధమయ్యాడు. ఆయన నటించబోయే 25వ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంచనంగా జరిగింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు.
నాని మొదటి సినిమా 'అష్టాచమ్మా'కు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడితోనే నాని 25వ చిత్రం చేస్తుండటం గమనార్హం. ఈ చిత్రంలో నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. నివేథా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు.
‘వి'చిత్రమైన టైటిల్
ఈ చిత్రానికి ‘వి' అనే టైటిల్ ఖరారు చేశారు. సింగిల్ లెటర్తో వినడానికి ఇది కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ టైటిల్ వెనక ఆసక్తికర కథనం ఉంటుందని తెలుస్తోంది. ‘వి' పేరుతో ఆల్రెడీ అఫీషియల్ పోస్టర్లు సైతం విడుదల చేశారు. ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించబోతున్నారట... మరి అందుకే ‘వి' టైటిల్ పెట్టారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
|
ఇది విభిన్నంగా ఉంటుందన్న నాని
‘ఆయన నన్ను హీరోగా పరిచయం చేసి మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. ఇపుడు నా 25వ చిత్రంతో మరోసారి పరిచయం చేస్తున్నారు. కానీ ఈ సారి పూర్తి విభిన్నంగా ఉంటుంది.'' అంటూ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి నాని ట్వీట్ చేశారు.
హిట్ చిత్రాలు అందించిన ఇంద్రగంటి
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తనదైన శైలిలో ఫీల్ గుడ్ సినిమాలు చేయడంలో సిద్దహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అష్టాచమ్మ, గోల్కొండ హైస్కూల్, జెంటిల్మెన్, సమ్మోహనం చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబుతో చేస్తున్న ‘వి' సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
దిల్ రాజు మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి
కథలో దమ్ముంటే తప్ప దిల్ రాజు ఏ సినిమా కూడా యాక్సెప్ట్ చేయడు. ఆయన బేనర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘వి' చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు సమర్పణలో శిరీస్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిత్ త్రివిది సంగీతం అందిస్తుండగా, పిజి విందా సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్నారు.