Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.. అడ్డాల చంటిపై మండిపడ్డ నట్టి కుమార్!
టాలీవుడ్లో ఓ సినిమా హక్కుల విషయంలో ఇద్దరు అగ్ర నిర్మాతల మధ్య వివాదం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ కృష్ణ, టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఐనా ఇష్టం నువ్వు అనే సినిమా హక్కుల విషయం నిర్మాతలు చంటి అడ్డాల, నట్టి కుమార్ మధ్య వివాదాన్ని రేపింది. ఈ వివాదంపై నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ..
ఐనా ఇష్టం నువ్వు చిత్రాన్ని తమకు అమ్మినట్టు మా వద్ద బాండ్ పేపర్లు, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మా ఒప్పందాన్ని ఉల్లంఘించిన అడ్డాల చంటి మాట మర్చారు. ఇంకా ఎక్కువ మనీ ఇవ్వమని నిర్మాత చంటి బ్లాక్ బెయిల్ చేస్తున్నారు అని నట్టి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించకుంటే నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఇక ఐనా ఇష్టం నువ్వు సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం నట్టీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడు రోజుల షూటింగ్ మినహాయించి సినిమా మొత్తం పూర్తయింది అని యూనిట్ వెల్లడించింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఐనా ఇష్టం నువ్వు చిత్రంలో రాహుల్ దేవ్ విలన్గా నటిస్తున్నారు. సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు మిగితా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్, సంగీతం: అచ్చు అని యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.