Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.. అడ్డాల చంటిపై మండిపడ్డ నట్టి కుమార్!
టాలీవుడ్లో ఓ సినిమా హక్కుల విషయంలో ఇద్దరు అగ్ర నిర్మాతల మధ్య వివాదం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ కృష్ణ, టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఐనా ఇష్టం నువ్వు అనే సినిమా హక్కుల విషయం నిర్మాతలు చంటి అడ్డాల, నట్టి కుమార్ మధ్య వివాదాన్ని రేపింది. ఈ వివాదంపై నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ..
ఐనా ఇష్టం నువ్వు చిత్రాన్ని తమకు అమ్మినట్టు మా వద్ద బాండ్ పేపర్లు, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మా ఒప్పందాన్ని ఉల్లంఘించిన అడ్డాల చంటి మాట మర్చారు. ఇంకా ఎక్కువ మనీ ఇవ్వమని నిర్మాత చంటి బ్లాక్ బెయిల్ చేస్తున్నారు అని నట్టి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించకుంటే నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఇక ఐనా ఇష్టం నువ్వు సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం నట్టీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడు రోజుల షూటింగ్ మినహాయించి సినిమా మొత్తం పూర్తయింది అని యూనిట్ వెల్లడించింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఐనా ఇష్టం నువ్వు చిత్రంలో రాహుల్ దేవ్ విలన్గా నటిస్తున్నారు. సప్తగిరి, కొండవలస, చాందిని, ఫణి, రఘు తదితరులు మిగితా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సురేష్, సంగీతం: అచ్చు అని యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.