Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
God Father: చిరంజీవి స్థానంలో నయనతార.. గాడ్ ఫాదర్ డైరెక్టర్ పోస్ట్ వైరల్
రాజకీయాల కోసం చాలా గ్యాప్ తీసుకుని.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అనుమానాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఆయనలో ఉత్సాహం రెట్టించింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ చిరంజీవి జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయన రామ్ చరణ్తో కలిసి 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. దీంతో ఆయన తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు.
హాట్ షోతో షాకిచ్చిన ఈషా రెబ్బా: పైనుంచి చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగు పిల్ల
'ఆచార్య' మూవీ షూటింగ్ జరుగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టులను ఆరంభించేశారు. అందులో 'గాడ్ ఫాదర్' సినిమా ఒకటి. మలయాళ పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రూపొందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
క్రేజీ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 45 శాతం వరకూ పూర్తైందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఆ మధ్య దీనికి సంబంధించిన షెడ్యూళ్లను ప్లాన్ చేసుకున్నా.. చిరంజీవికి కరోనా సోకడం వంటి కారణాల వల్ల అవి మాత్రం ముందుకు సాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్లో ఈ సినిమా మరో షెడ్యూల్ను జరుపుతూ వచ్చారు. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ సహా పలువురు కీలక నటీనటులతో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ చాలా రోజుల పాటు సాగబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే యూనిట్ వెల్లడించింది.
ఘోరమైన ఫోజులతో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో బెడ్రూంలో ఆమెనిలా చూశారంటే!
ఇక, ఇటీవలే 'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన మరో షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అయింది. ఇందులో చిరంజీవి మినహా మిగిలిన నటీనటులు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ షెడ్యూల్ మొత్తం పాల్గొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దీన్ని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అందులో 'లేడీ సూపర్ స్టార్ నయనతార గాడ్ ఫాదర్ కోసం ఓ మేజర్ షెడ్యూల్ను పూర్తి చేశారు. ఆమెతో వరుసగా మూడోసారి పని చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని పేర్కొన్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి ఫొటో వైరల్ అవుతోంది.
'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు చాలా మంది కీలకమైన పాత్రలను చేస్తున్నారు.