Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్: బోయపాటితో మొదలెట్టిన నందమూరి నటసింహం
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో కొత్త సినిమా రానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మధ్య మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా విన్నాం. కానీ ఎట్టకేలకు నేడు (డిసెంబర్ 6) ఈ సినిమాను ప్రారంభించారు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.
దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105 సినిమా 'రూలర్' సినిమాతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాగానే బోయపాటి సినిమా రెగ్యులర్ షూట్లో పాల్గొననున్నారు బాలకృష్ణ.
బాలకృష్ణ- బోయపాటి కాంబోకి సంబంధించిన వివరాలు నందమూరి అభిమాన వర్గాల్లో ఇప్పటినుంచే ఆతృతను పెంచేస్తున్నాయి. ''సింహా, లెజెండ్'' వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. బాలకృష్ణ కెరీర్లో 106వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ''నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం'' అనే డైలాగ్తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు అతిత్వరలో వెల్లడించనున్నారు.