Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముందే లీకైన ఆచార్య మూవీ సర్ప్రైజ్: చిరంజీవి నుంచి నెక్ట్స్ వచ్చేది అదేనట
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం 'ఆచార్య'. మెగా మల్టీస్టారర్గా రాబోతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. దీని కోసం భారీ ఖర్చుతో టెంపుల్ టౌన్ అనే సెట్ను కూడా వేశారు. ఇక, ఈ మధ్యనే ముఖ్యమైన షెడ్యూల్ ప్రారంభమైనా.. కరోనా ప్రభావంతో అది కాస్తా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' మూవీ నుంచి ఓ అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.
యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..
'ఆచార్య' సినిమా నుంచి ఇప్పటికే టీజర్తో పాటు ఓ మెలోడీ సాంగ్ కూడా విడుదలైంది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇది రామ్ చరణ్ - పూజా హెగ్డే మధ్య సాగే 'నీలాంబరీ' అనే సాంగ్ అని విస్వసనీయంగా తెలిసింది. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ టచ్ కనిపిస్తుందని.. ఇది సినిమాకే హైలైట్గా నిలిచే పాట అవుతుందని అంటున్నారు. దీంతో ఈ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.
భారీ మల్టీస్టారర్గా తెరకెక్కుతోన్న 'ఆచార్య' మూవీలో చిరంజీవి, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్కు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.