Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆసక్తి రేకెత్తిస్తున్న ఆది పినిశెట్టి ‘నీవెవరో’ టీజర్
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'నీవెవరో'. హరినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఆదివారం విడుదల చేశారు.
'మూడు నగరాలు.. రెండు ప్రేమకథలు.. ఒక్క సంఘటన' అంటూ హీరో ఆది చెప్పే డైలాగుతో మొదలైన టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.
'ఇది ప్రమాదం కాదు సర్.. ఇది హత్య' అనే డైలాగ్స్ ఉండటం బట్టి ఈ మూవీ ఒక హత్యోదంతం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 'ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో ఒక రూపంలో వస్తుంది. నాకు ఏ రూపంలో వస్తుందో చూడాలి' అంటూ ఆది పినిశెట్టి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
'వీడ్ని స్కెచ్ వేసి చంపింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్. కిమ్ అయినా.. ట్రంప్ అయినా లోపలేసి కుమ్ముతా' అంటూ వెన్నెల కిషోర్ ఫన్నీ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను నవ్విస్తాడని అర్థం చేసుకోవచ్చు. టీజర్పై మీరూ ఓ లుక్కేయండి మరి.