RCB విజయంతో అన్నీ విప్పేసిన టాప్ బ్యూటీ.. ఏఐ పిక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) ట్రోఫీని కైవసం చేసుకుంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెంగళూరు జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో భాగంగా బెంగళూరులో జరిగిన విజయోత్సవాల్లో తొక్కిసలాట చోసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది వరకు గాయపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రికెట్, రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.
ఐపీఎల్కు ఎందుకంత హడావుడి
తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ సీటీ పోలీస్ కమీషనర్తో పాటు కొందరు ఉన్నతాధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్సీబీ ప్రతినిధులను అరెస్ట్ చేయాల్సిందిగా అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ఈ వ్యవహారంపై కర్ణాటకలో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఆర్సీబీ ఏదో ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి వచ్చినట్లుగా సన్మానాలు, సత్కారాలు, విజయోత్సవాలు ఎందుకు చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు

నెటిజన్లను రెచ్చగొడుతున్న సోషల్ మీడియా స్టార్స్
క్రికెట్కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా దేశంలో మెగా టోర్నీలు జరిగినప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీలు, కొందరు హీరోయిన్లు తాము బీచ్లో అర్ధనగ్నంగా తిరుగుతామని, టాప్ విప్పేస్తామని సవాళ్లు విసురుతుంటారు. ఐపీఎల్ విషయంలోనూ ఇలాంటి వారు కొందరు తయారయ్యారు. కొద్దిరోజుల క్రితం కేరళకు చెందిన అంకిత అనే ఓ సోషల్ మీడియా సెలబ్రెటీ కూడా ఇదే రకమైన ఛాలెంజ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభిమాని అయిన అంకిత ఫైనల్లో తన ఫేవరెట్ జట్టు గెలవడంతో సంబరాలు జరుపుకుంది. సవాల్ మేరకు తన ఛాతి, నడుము భాగం కనిపించేలా బ్రాతో ఉన్న ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టింది అంకిత.
అంకితను ఆడుకున్న నెటిజన్లు
అయితే అసలు ఫోటో కాదని, నకిలీది అంటూ నెటిజన్లు ట్రోలింగ్కు దిగడంతో అంకిత స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొందరు గతంలో ఉన్న విభేదాలతో తనను టార్గెట్ చేశారని మండిపడింది. నా అభిమాన జట్టు గెలిస్తే ఏం చేస్తానని చెప్పానో ఆ మాటను నిలబెట్టుకున్నానని అంకిత క్లారిటీ ఇచ్చింది. అచ్చం ఇదే తరహాలో ట్రోలింగ్ బారినపడింది మరో సోషల్ మీడియా స్టార్. కాశ్మీర్కు చెందిన కృతిక సోనీ అలియాస్ శివానీ కాశ్మీరీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఖాతాలో ఈమెకు బాగా ఫాలోవర్స్ ఉన్నారు.
శివానీ కాశ్మీరీపై ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిస్తే తాను బ్రాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తానని సవాల్ విసిరింది. ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో మీ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు? బ్రాతో ఉన్న ఫోటో ఎప్పుడు పెడతారంటూ? నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్ వరుస పోస్టులు పెట్టారు. దీనిపై రెండ్రోజుల క్రితం శివానీ స్పందించింది. మీ కోరిక ఖచ్చితంగా తీరుస్తానని ఓ వీడియో చేసింది. తాజాగా శుక్రవారం బ్రాతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ కలర్ బ్రాలో అందాలు ఆరబోస్తూ ఉన్న ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఒరిజినల్ ఫోటో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించారంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మాకు ఒరిజినల్ ఫోటో కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై శివానీ కాశ్మీరీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











