Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
వైరల్ అవుతున్న 'విత్ పీకే'.. పవన్ నీ వెంటే నేను అంటున్న యంగ్ హీరో
భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. సమాజంలో అవినీతి పుట్టలు పుట్టలుగా పెరుగుతోందని, దాన్ని చిదిమేసేందుకే తాను జనసేనానిగా మీ ముందుకొస్తున్నాని ప్రకటించారు పవన్. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీ స్థాపించి.. పోటీలో లేకుండా కేవలం ప్రచారాలు చేశారు. జనసేన పార్టీ పేరు ప్రజల్లోకి వెళ్ళాక అప్పుడు పోటీకి దిగారు. గ్లాస్ గుర్తుతో ఆయన ప్రారంభించిన ప్రస్థానానికి ఆదిలోకే చుక్కెదురైంది. పవన్ కళ్యాణ్ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోలేదు. 2019 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పవన్ని, ఆయన పార్టీ అభ్యర్థులందరినీ చిత్తుగా ఓడించారు.
Everything Begins with 1...
Janasena Party wins its 1st seat from Razole..
Hope it's the Start of Bigger things in the future. https://t.co/sctBNgOPCz— Nikhil Siddhartha (@actor_Nikhil) May 23, 2019
దీంతో పవన్ కళ్యాణ్, ఆయన అభిమాన వర్గమంతా షాకయ్యింది. ఏపిలో జనసేన ప్రభంజనం భారీ ఎత్తున ఉంటుందని ఊహించిన మెగా వర్గానికి కోలుకోలేని దెబ్బ పడింది. ప్రచారంలో పవన్ డెడికేషన్, నాగబాబు యూ ట్యూబ్ టెక్నీక్స్ ఇవేవీ జనసేన పార్టీని కాపాడలేక పోయాయి. దారుణమైన పరాభవం ఎదురవడంతో మెగా ఫ్యామిలీతో పాటు పవన్ అభిమాన వర్గాలు కరవరపడ్డాయి. పవన్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చవిచూడగా.. నాగబాబు ఎంపీ ఆశలు ఆవిరయ్యాయి. ఒక్క రాజోలు మినహాయిస్తే జనసేన ఎక్కడా జనం లోకి వెళ్లలేక పోయింది. దీంతో నిరాశ చెందిన పవన్ వర్గానికి సోషల్ మీడియాలో కొందరు సపోర్ట్ పలుకుతున్నారు.
'విత్ పీకే' అనే హాష్ ట్యాగ్తో జనసేనకు తమ వంతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విత్ పీకే హ్యాష్ట్యాగ్ ట్వీట్లతో జనసేన కేడర్లోనూ, అధినేత పవన్ లోనూ ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు పవన్ నీ వెంటే మేముంటాం అంటూ పెద్ద ఎత్తున మెసేజీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. అడుగు ఎప్పుడూ ఒకటి తోనే మొదలవుతుందని, రాజోలు గెలుపు భవిష్యత్కి పునాది.. అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.