twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లోకి నిశ్శబ్దం డైరెక్టర్‌.. రెండు క్రేజీ ప్రాజెక్టులతో హేమంత్ మధుకర్

    |

    నిశ్శబ్దం చిత్రంతో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు హేమంత్ మధుకర్ ఆ చిత్రం అందించిన విజయంతో జోష్‌తో ముందుకెళ్తున్నారు. టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి, విలక్షణ నటుడు మాధవన్‌తో నిశ్శబ్దం చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. తాజాగా హేమంత్ మరో రెండు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

    తన తొలి చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించిన హేమంత్ మధుకర్ తన రెండో చిత్రాన్ని రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా అందించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత గోపి మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

    Nishabdham director Hemant Madhukar into bollywood

    ఇక రెండో ప్రాజెక్టు ద్వారా హేమంత్ మధుకర్ మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. గతంలో ఏ ఫ్లాట్ అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కించే చిత్రాన్ని హిందీలో తన రెండో చిత్రంగా రూపొందించనున్నారు. బాతే అనే టైటిల్‌తో తెరకెక్కించే చిత్రానికి కహానీ, పింక్‌ చిత్రాల రచయిత రితేష్‌ షా స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టు సమాచారం.

    బాతే చిత్ర షూటింగ్ 70 శాతం లండన్‌లో జరగనుందని వార్తలు వినవస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రానున్నాయని సమాచారం.

    English summary
    Nishabdham director Hemant Madhukar prepairing with another two projects. He is planning his second movie as an Action romantic picture. Another is Bathe is a bollywood movie. Kahani, Pink writer is penning Screen play for Bathe
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X