Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘మాస్ట్రో’ కోసం నితిన్, తమన్నా స్పెషల్గా: అదిరిపోయేలా ప్లాన్ చేసిన డైరెక్టర్
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో'. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం.. బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన 'అంధాధున్'కు రీమేక్గా వస్తోంది. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక, త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ ఫీస్ట్ను కూడా మొదలెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ పాటను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో 'మాస్ట్రో' కోసం డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మాస్ట్రో' మూవీ విడుదలకు సమయం దగ్గర పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అనువుగా ఓ ప్రమోషనల్ సాంగ్ను స్పెషల్గా రూపొందిస్తున్నారని సమాచాం. ఇందుకోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రకరణను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఇది షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో హీరో నితిన్తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసుకుని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'మాస్ట్రో' మూవీలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఏకంగా రూ. 32 కోట్లు వెచ్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ ట్రైలర్ను అతి త్వరలోనే విడుదల చేసి.. సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది.