Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మాస్ట్రో’ కోసం నితిన్, తమన్నా స్పెషల్గా: అదిరిపోయేలా ప్లాన్ చేసిన డైరెక్టర్
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో'. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం.. బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన 'అంధాధున్'కు రీమేక్గా వస్తోంది. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక, త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ ఫీస్ట్ను కూడా మొదలెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ పాటను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో 'మాస్ట్రో' కోసం డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మాస్ట్రో' మూవీ విడుదలకు సమయం దగ్గర పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అనువుగా ఓ ప్రమోషనల్ సాంగ్ను స్పెషల్గా రూపొందిస్తున్నారని సమాచాం. ఇందుకోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రకరణను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఇది షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో హీరో నితిన్తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసుకుని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'మాస్ట్రో' మూవీలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఏకంగా రూ. 32 కోట్లు వెచ్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ ట్రైలర్ను అతి త్వరలోనే విడుదల చేసి.. సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది.