Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అంధాధూన్ తెలుగు రీమేక్.. మరో టార్గెట్ సెట్ చేసుకున్న నితిన్
పవర్ స్టార్ పవర్ఫుల్ ఫ్యాన్ నితిన్ పెళ్లి తరువాత స్పీడ్ పెంచినట్లు అర్ధమయ్యింది. భీష్మ కంటే ముందు వెండితెరకి దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ ఇచ్చిన నితిన్ బాక్సాఫీస్ హిట్ వచ్చిన తరువాత వెంటనే పెళ్లి చేసుకున్నాడు. ఇక రంగ్ దే విడుదలకు కరోనా అడ్డుపడగా మరో పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలని టార్గెట్ సెట్ చేసుకున్నాడు.
ఇటీవల సాహసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమాను ఎనౌన్స్ చేసిన నితిన్ ఆ తరువాత బాలీవుడ్ రీమేక్ అందాదున్ ని కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని డిసైడ్ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి. టబు పాత్రలో ఇటీవల తమన్నాను ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ హీరోయిన్ పాత్రలో నాభ నటేష్ ని ఓకే చేశారు.
ఇక దర్శకుడు మెర్లపాక గాంధీ మెల్లమెల్లగా తన టీమ్ సభ్యులను కూడా ఫైనల్ చేస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తో కలిసి దర్శకుడు కొత్త లొకేషన్స్ కోసం గోవా వెళ్లారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తేవాలని నితిన్ మరో న్యూ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ రోజులు సమయం తీసుకోకుండా షూటింగ్ ని స్పీడ్ గా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. మరి బాలీవుడ్ లో భారీ హిట్ అందుకున్న అందాదున్ కాన్సెప్ట్ తెలుగులో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.