Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Maestro మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: నితిన్ సినిమా ఎందులో రాబోతుందంటే!
గత ఏడాది 'భీష్మ'తో కెరీర్లోనే భారీ హిట్ను అందుకున్నాడు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ సంవత్సరం మాత్రం అతడికి అంతగా కలిసి రాలేదు. ఇప్పటికే ఈ యంగ్ హీరో నటించిన రెండు సినిమాలు (చెక్, రంగ్ దే) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయ్యాడు. అదే.. బాలీవుడ్ హిట్ మూవీ 'అంధాధున్'కు రీమేక్గా వచ్చిన 'మాస్ట్రో'. తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
కరోనా రెండో దశ కారణంగా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ క్రమంలోనే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో' కూడా ఓటీటీ డీల్ను ఫిక్స్ చేసుకుంది. ఇందులో భాగంగానే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ ఈ సినిమా హక్కులను ఏకంగా రూ. 32 కోట్లకు కొనగోలు చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుందట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
బట్టలు మొత్తం తీసేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్: అరాచకమైన ఫొటోలతో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్
క్రైమ్ థ్రిల్లర్గా రాబోతున్న 'మాస్ట్రో'లో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. దీన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.