Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
గుడ్ న్యూస్ చెప్పిన ‘మాస్ట్రో’ యూనిట్: పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'కు ఇది రీమేక్గా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దీంతో దీన్ని జూన్ 11న విడుదల చేస్తామని కూడా అప్పుడు ప్రకటించారు. అయితే, కరోనా రెండో దశ కారణంగా అది సాధ్య పడలేదు. ఇప్పుడు కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఈ మధ్యనే చిత్రీకరణను పున: ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ యూనిట్ నితిన్ ఫ్యాన్స్కు తాజాగా ఓ గుడ్ న్యూస్ను చెప్పింది.
కొంత భాగం షూటింగ్ మిగిలి ఉన్న సమయంలోనే 'మాస్ట్రో' చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇక, ఇటీవలే మొదలైన షెడ్యూల్లో హీరో నితిన్పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే, తమన్నా భాటితో నితిన్ సీన్స్ను కూడా షూట్ చేశారు. వీటితో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం తెరకెక్కించారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ను సైతం యూనిట్ సోషల్ మీడియాతో విడుదల చేసింది. దీనిపై నితిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
షూటింగ్ మొత్తం పూర్తవగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట 'మాస్ట్రో' యూనిట్. వీటిని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి సినిమాను విడుదల చేయబోతున్నారని అంటున్నారు. దీన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారని టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.