Don't Miss!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గద్దలకొండ గణేష్తో బాగా ఎంజాయ్ చేశా.. 20న గత్తర లేపాల!.. నితిన్ కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిందిన కొత్త సినిమా 'వాల్మీకి'. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. గద్దలకొండ గణేష్ అనే నెగిటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు వరుణ్ తేజ్. అదేవిధంగా తమిళ హీరో అధర్వ కీలకపాత్రలో నటించాడు. ఇక సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, డైరెక్టర్ సకుమార్, హీరో నితిన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండటం విశేషం.
అయితే సెప్టెంబర్ 20వ తేదీన వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంతో ట్విట్టర్ వేదికగా సందేశమిస్తూ చిత్రయూనిట్కి శుభాకాంక్షలు చెప్పాడు నితిన్. ''మిస్టర్ గద్దలకొండ గణేష్తో నేను. వాల్మీకి సినిమాలో నటించేటప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ఈ రోజులు చాలా సరదాగా గడిచాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇట్లు.. మీ భీష్మ. సెప్టెంబర్ 20న గత్తర లేపాల హరీష్'' అని ట్వీట్ లో పేర్కొన్నాడు.