Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఓటీటీ వైపు నితిన్ న్యూ మూవీ.. సెటిల్మెంట్ కోసం బడా కంపెనీల ఆరాటం?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది చివరగా వచ్చిన హిట్ సినిమాల్లో భీష్మ ఒకటి. యంగ్ హీరో నితిన్ కెరీర్ లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఆ సినిమా నిలిచింది. అయితే అంతకుముందు వరకు నితిన్ కొన్ని ఆపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అందుకే ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకొని భీష్మ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.
ఇక నెక్స్ట్ కూడా అలాంటి మంచి విజయాలను అందుకోవాలని ఈ యువ హీరో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ సారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం లేదని అనిపిస్తోంది. నితిన్ రంగ్ దే సినిమా ఆల్ మోస్ట్ ఏండింగ్ లోనే ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఒకవేళ థియేటర్స్ రిలీజ్ చేసినా కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ వద్ద హడావుడి గతంలో మాదిరిగా సందడిగా అయితే కనిపించదు. అందుకే ఓటీటీలోనే డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీ పడుతున్నాయి. జీ5 తో పాటు హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ మధ్య పోటీ ఎక్కువనట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా జీ5 డిజిటల్ రైట్స్ కోసం నిర్మాతలకు లాభం వచ్చేలా ఆఫర్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా నిర్మాతలు శాటిలైట్, ఓటీటీ రైట్స్ తోనే సేఫ్ జోన్ పడాలని చూస్తున్నారు. మరి రంగ్ దే ఎలా రిలీజ్ అవుతుందో చూడాలి.