Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నితిన్ అభిమానులకు పుట్టినరోజు కానుక: అర్ధరాత్రి కొత్త సినిమా టైటిల్ లుక్ రివీల్
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్గా వెలుగొందుతున్నాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో ఎన్నో ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఇలాంటి సమయంలో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి జయాపజయాలతో కెరీర్ను సమాంతరంగా నడుపుకుంటున్నాడు. ఇక, ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన చిత్రం 'అంధాధున్'. దీన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు నితిన్. ఇప్పటికే స్వయంగా ఈ మూవీ హక్కులు తీసుకున్న అతడు.. చాలా కాలం పాటు వేచి చూశాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనతో పాటు రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశాడు. ఇక, మార్చి 30వ తేదీన అతడి పుట్టినరోజును పురస్కరించుకుని.. అర్ధరాత్రే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో నితిన్ అంధుడిగా కనిపిస్తున్నాడు. అలాగే, బ్యాగ్రౌండ్లో రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో సినిమాపై అప్పుడే ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు. నితిన్ సొంత బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.