Don't Miss!
- News ఊపిిరి పీల్చుకున్న ఉద్యాననగరి
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నితిన్ అభిమానులకు పుట్టినరోజు కానుక: అర్ధరాత్రి కొత్త సినిమా టైటిల్ లుక్ రివీల్
చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్గా వెలుగొందుతున్నాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో ఎన్నో ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఇలాంటి సమయంలో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి జయాపజయాలతో కెరీర్ను సమాంతరంగా నడుపుకుంటున్నాడు. ఇక, ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన చిత్రం 'అంధాధున్'. దీన్ని తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు నితిన్. ఇప్పటికే స్వయంగా ఈ మూవీ హక్కులు తీసుకున్న అతడు.. చాలా కాలం పాటు వేచి చూశాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రకటనతో పాటు రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశాడు. ఇక, మార్చి 30వ తేదీన అతడి పుట్టినరోజును పురస్కరించుకుని.. అర్ధరాత్రే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో నితిన్ అంధుడిగా కనిపిస్తున్నాడు. అలాగే, బ్యాగ్రౌండ్లో రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో సినిమాపై అప్పుడే ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'అంధాధున్'లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లు. నితిన్ సొంత బ్యానర్లో ఈ చిత్రం నిర్మాణం అవుతుంది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.