Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
PSPKRana Movie: పవన్కు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్.. ప్రకటించిన యూనిట్
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం దగ్గుబాటి రానాతో కలిసి మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్లో నటిస్తున్నాడు. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఇగో ఉన్న ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇందులో టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ.. ఆమెకు స్వాగతం పలికింది. ఆమె ఎవరికి జోడీగా నటిస్తుందని ఇందులో పేర్కొనలేదు. కానీ, ఫిలిం నగర్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఆమె పవన్కు జోడీగానే చేస్తుందని తెలుస్తోంది.
శృతి మించిన టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్: ఎద అందాలు చూపిస్తూ రచ్చ.. ప్యాంటును కూడా తీసేసి మరీ!
పవర్ఫుల్ కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్.. 'భీమ్లా నాయక్' అనే పోలీస్ పాత్రను చేస్తున్నాడు. అలాగే, దగ్గుబాటి రానా లోకల్ డాన్గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా షూటింగ్ పూర్తైంది. ఇక, ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'పరశురామ కృష్ణమూర్తి', 'బిల్లా రంగా' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.