Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘విరాట పర్వం’పై అంచనాలు పెంచిన నివేథా: అది కాసేపే అయినా కష్టమైనదని క్లారిటీ
చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు 'విరాట పర్వం' అనే సినిమాలో నటించాడు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల మాత్రం అవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా 'విరాట పర్వం' మూవీపై హీరోయిన్ నివేథా పేతురాజ్ అంచనాలు పెంచేసింది.
'విరాట పర్వం' సినిమాలో నివేథా పేతురాజ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. 'విరాట పర్వంలో నా పాత్ర చాలా తక్కువ సేపే ఉంటుంది. కానీ, ఎంతో చక్కగా ఉంటుంది. ఇది నా కెరీర్లోనే ఎంతో కష్టమైన రోల్. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్లో వర్షం కురుస్తున్న సమయంలో చిత్రీకరణ జరిపాం. అవన్నీ ఎంతో చక్కగా వచ్చాయి. సినిమాను ఎంతో ఉన్నతంగా తెరకెక్కించారు' అని చెప్పింది. తద్వారా ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది.
మన్యం ప్రాంతంలో పుట్టిన సున్నితమైన ప్రేమకథకు నక్సలిజం అనే పాయింట్ను జోడిండి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో దగ్గుబాటి రానా కామ్రెడ్ రవన్నగా నటిస్తుండగా.. సాయి పల్లవి పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పోస్టర్లు, పాటలు, టీజర్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చాడు.