Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సర్కారు వారి పాట’ సర్ప్రైజ్పై అయోమయం: అసలేం వస్తుందో క్లారిటీ రావట్లేదు
ఈ మధ్య కాలంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందుకుని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ ఫామ్తో కనిపిస్తున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతోన్న అతడు.. ఒకదాని తర్వాత ఒక సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
'సర్కారు వారి పాట' నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు మోషన్ వీడియో మాత్రమే విడుదల అయ్యాయి. దీంతో పాట గానీ, టీజర్ గానీ ఎప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ అభిమానులు వేయి కళ్లతో వేచి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమా నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయేది టీజర్ అని కొందరు.. పాట అని మరికొందరు.. పోస్టర్ అని ఇంకొందరు అంటున్నారు. దీంతో అసలేం వస్తుందో అర్థంకాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో చిత్ర యూనిట్ నుంచి మహేశ్ బాబు ఫ్యాన్స్ వివరణ కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థలకు అభ్యర్ధనలు పంపుతున్నారు. దీంతో 'సర్కారు వారి పాట' ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కరోనా ప్రభావం కారణంగా నిలిచిపోయింది.