Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణను వదిలేసి .. వాళ్లనే టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ!
రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన.. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. సినిమాలు తీయడంలోనూ.. సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ ఆయన అందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కొద్దిరోజులుగా ఆయన రాజకీయాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఆయన మీద ఒట్టేసి మొదలెట్టాడు
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమాలోని పాటను విడుదల చేసే వరకు ఇది షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఎవరికీ తెలియదు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పాటను విడుదల చేస్తానని వర్మ ట్వీట్ చేశాడు. అందులో ‘ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని మొదటి పాటను తొమ్మిదో తారీఖు, తొమ్మిది గంటలకు విడుదల చేస్తాను' అని పేర్కొన్నాడు. అంతేకాదు, ఇది వివాదాస్పదం కాదని చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నానన్నాడు. దీంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.
ఏదో ఒక బాణం వేస్తూనే ఉన్నాడు
సంచలన దర్శకుడు ఆర్జీవీ చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఆయన కొద్ది రోజులుగా ఇస్తున్న అప్డేట్లే. ఇందులో నటించే పాత్రధారులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తున్నాడాయన. ముఖ్యంగా ఓ పార్టీ అధినేతను టార్గెట్ చేసిన వర్మ.. ఆయనపై ఎన్నో బాణాలను సంధిస్తున్నాడు. దీంతో ఆ పార్టీ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పదం కాదన్నాడు.. కానీ...
రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు. అంటే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపై స్టోరీని అల్లుకున్నాడట ఈ సంచలన దర్శకుడు.
బాలకృష్ణను చూపించబోతున్నాడు
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను సైతం చూపించబోతున్నాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే, వర్మ విడుదల చేసిన ట్రైలర్లో బాలయ్య క్యారెక్టర్ను చూపించకపోవడంతో ఇది అసత్యం అన్నారు. కానీ, దీనిపై మరో రకమైన వార్తలు వచ్చాయి. ట్రైలర్లో చూపించకున్నా.. సినిమాలో మాత్రం బాలయ్య పాత్రను చూపించబోతున్నాడనే టాక్ వినిపించింది. ఇప్పటికే దాని తాలూకు షూటింగ్ కూడా పూర్తయిందని కొందరు అన్నారు.
Recommended Video
బాలయ్యను వదిలేశాడు
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పాత్రను చూపించడం లేదట వర్మ. ఆయన ప్రధాన దృష్టి మొత్తం రెండు పార్టీల అధినేతలపైనేనని తెలుస్తోంది. వీరిద్దరితో పాటు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న మరికొందరు నాయకులను కూడా చూపించబోతున్నాడట ఈ సంచలన దర్శకుడు. సో.. ఇందులో బాలయ్య కనిపించడన్న మాట.