Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
NTR30: అనుకున్నట్లే జరిగింది.. ఈ సారి అంతకుమించి అంటూన్న కొరటాల.. రిలీజ్ డేట్ ఫిక్స్!
జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నట్లే త్రివిక్రమ్ ప్రాజెక్టు నుంచి తప్పుకొని మరొక దర్శకుడిని ట్రాక్ లోకి తెచ్చాడు. జనతా గ్యారేజ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న తరువాత మరోసారి వీరి కలయికలో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
RRR అనంతరం
జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయాలని అనుకున్నాడు. ఇద్దరు ఫిక్స్ అయిన తరువాతే అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు అని అనుకున్న సమయానికి ఎదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఫ్రెండ్లిగానే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్
ఇక మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్నాడు అనగానే ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో అసలు ఏం జరిగింది అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే అభిప్రాయ బేధాలు వచ్చి కోపంగానే క్యాన్సిల్ చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. RRR తరువాత ఈ రేంజ్ కథ చేయడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ స్వయంగా వద్దని చెప్పినట్లు టాక్ వస్తోంది. ఫ్రెండ్లిగానే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం.
పాన్ ఇండియా రేంజ్ లోనే?
ఇక మొత్తానికి అనుకున్నట్లే దర్శకుడు కొరటాల శివను ఫిక్స్ చేసుకున్నారు. గత రెండు రోజులుగా ఈ కాంబినేషన్ కు సంబంధించిన రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
ఇక కొరటాల శివ పోస్ట్ చేసిన ట్వీట్ ను బట్టి చూస్తుంటే సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైమ్ లోకల్ గానే రిపేర్లు జరిగాయని.. ఇప్పుడు బౌండరీస్ దారుతున్నట్లు చెప్పడంతో సినిమాను నేషనల్ వైడ్ గా ప్లాన్ చేసినట్లు టాక్.
రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇక ఫైనల్ గా సినిమా విడుదల తేదీని కూడా చెప్పేశారు. అసలైతే కొరటాల శివ ఆచార్య అనంతరం అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడడంతో ఆ ప్రాజెక్టునును వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. యువసుదా, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయి.