Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంచరణ్, ఎన్టీఆర్, అఖిల్ ఒకే చోట.. పార్టీ రచ్చ రచ్చ
టాలీవుడ్ హీరోల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ అందర్నీ ఆకట్టుకొనేలా ఉంటున్నది. స్టార్ హీరోలు తమ ఇగోలను పక్కన పెట్టి ఒకరి సినిమా కోసం మరొకరు సపోర్టుగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఇతర హీరోలు సినిమాల ఫంక్షన్లో పాల్గొని ప్రమోట్ చేస్తుండటంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను సినిమా వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మిస్టర్ మజ్ను సినిమా విజయాన్ని ఆకాంక్షించారు కూడా. ఈ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొనడం స్పెషల్ ఎట్రాక్షన్గా మారింది.
మిస్టర్ మజ్ను సినిమా వేడుక తర్వాత జరిగిన పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్తో రాంచరణ్ జతకలిశాడు. ఈ పార్టీకి నాగార్జునతోపాటు ఈ ముగ్గురు హీరోలు కలవడంతో రచ్చరచ్చగా మారిందట. పార్టీలో వీరి కలయిక స్పెషల్ ఎట్రాక్షన్గా మారింది. ముగ్గురు హీరోలు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ మజ్ను చిత్రం జనవరి 25న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది.