Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోడ్డు ప్రమాదానికి గురైన యువ హీరో.. హీరోయిన్, డైరెక్టర్కు గాయాలు.. ఒకరు మృతి..
శేఖర్ కమ్ముల దర్వకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన సుధాకర్ కోమాకుల కు భారీ ముప్పు తప్పింది. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న నువ్వు తోపురా సినిమా బృందం కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి దర్శకుడు హరినాథ్బాబు తెలుగు ఫిల్మీబీట్కు ఫోన్లో వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రోడ్డు ప్రమాదంపై దర్శకుడు క్లారిటీ
రోడ్డు ప్రమాదంపై వస్తున్న వార్తపై దర్శకుడు హరినాథ్ స్పందిస్తూ.. నువ్వుతోపురా సినిమా ప్రమోషన్ కోసం ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. మేము ప్రయాణిస్తున్న కారు మంగళగిరికి సమీపంలోని చినకాకాని వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పింది. ఈ ఘటనలో మునిసిపల్ కార్మికురాలు ప్రమాదానికి గురై మరణించింది అని తెలిపారు.
ట్యాంకర్ను తప్పించబోయి
మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై కారు ప్రయాణిస్తుండగా ఎదురుగా ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్ను తప్పించే ప్రయత్నం డ్రైవర్ చేశాడు. ఆ ప్రయత్నంలో చెట్లకు మొక్కలు పోస్తున్న మునిసిపల్ కార్మికురాలు సడెన్గా రోడ్డుపైకి వచ్చింది. ఆ క్షణంలో ఆమెను తప్పించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. తీవ్రమైన గాయాలపాలు కావడంతో ఆమె మరణించారు అని దర్శకుడు హరినాథ్ ఫోన్లో తెలుగు ఫిల్మీబీట్కు వెల్లడించారు.
మీడియా వార్తలో వాస్తవం లేదని
రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో హీరో సుధాకర్ కారు నడుపుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న సుధాకర్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. యాక్సిండెట్ జరిగిన సమయంలో సుధాకర్ కారు నడపడం లేదు అని దర్శకుడు హరినాథ్ స్పష్టం చేశారు.
యాక్సిడెంట్పై కేసు నమోదు చేసి
నువ్వుతోపురా సినిమా బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతురాలి బాడీని పోస్టు మార్టమ్కు పంపించారు. గాయపడిన హీరో సుధాకర్, దర్శకుడు హరినాథ్, హీరోయిన్కు ప్రాథమిక చికిత్స అందించినట్టు సమాచారం.
ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్
నువ్వుతోపురా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల యంగ్ టైగర్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం కారు ప్రమాదానికి లోనైంది.