Don't Miss!
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఓ పిట్ట కథ సెన్సార్ పూర్తి.. ఇక విడుదలకు రెడీ
విలక్షణ నటుడు బ్రహ్మాజి తనయుడు సంజయ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓ పిట్టకథ. ఈ మధ్య ఓ పిట్టకథకు సంబంధించినన్ని ప్రమోషన్ కార్యక్రమాలు మరే సినిమాకు జరగలేవేమో. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఓ పిట్ట కథ కోసం కదిలాడు. త్రివిక్రమ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఎంతో మంది స్టార్స్ చేతులేసి పిట్ట కథను ప్రమోట్ చేశారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేత టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేయించడంతో మొదలు పెట్టిన ప్రమోషన్ కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వీటన్నంటితో పాటు కాన్సెప్ట్ పోస్టర్, టీజర్ ఇలా ప్రతీది ఉత్కంఠ రేపేలానే ఉండటంతో ఓ పిట్టకథ బాగానే పాపులర్ అయింది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా.. క్లిన్ యూ సర్టిఫికేట్ సంపాదించుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలుతోంది. ఇదే విషయాన్ని బ్రహ్మాజీ సోషల్ మీడియాలో పేర్కొంటూ.. యస్ ఇటీజ్ క్లీన్ యూ (YOU) అంటూ ఓ సెటైర్ కూడా వేశాడు. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Yess..it’s clean yoU..🤗#OpittaKatha 6th March👍 pic.twitter.com/lxocLCTyHr
— #OpittaKatha 6th March (@actorbrahmaji) February 26, 2020